లాక్డౌన్ వేళ వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు
ABN, First Publish Date - 2020-04-22T19:39:10+05:30
లాక్డౌన్ సమయంలో వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రకాశంజిల్లా: లాక్డౌన్ సమయంలో వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కారుమంచిలో వైసీపీ నేత నిర్వహించిన నిత్యావసర వస్తువుల పంపిణి కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. కొండపి నియోజవర్గం ఇన్చార్జ్ పెద్ద ఎత్తు జన సమూహంతో ఈ కార్యక్రమం నిర్వహించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నియంత్రణకు భౌతిక దూరం పాటించాలనే సూచనలు పట్టించుకోలేదన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, సహాయకచర్యల పేరిట సొంత ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు.
Updated Date - 2020-04-22T19:39:10+05:30 IST