బెజవాడలో అద్దెకు ఇల్లు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా..
ABN, First Publish Date - 2020-10-25T02:41:53+05:30
బెజవాడలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన 9 మంది యువకులను ..
కృష్ణా: బెజవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన 9 మంది యువకులను అరెస్ట్ చేశారు. నిందితులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. క్రికెట్ మజా యాప్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పెనమలూరు పీఎస్ పరిధి మురళినగర్లో అద్దెకు ఇల్లు తీసుకుని బెట్టింగ్కు పాల్పడ్డారు. రూ.7.50 లక్షలతో పాటు 20 మొబైల్ కనెక్షన్ కలిగిన కమ్యూనికేటర్ బాక్స్, ల్యాప్టాప్, 13 సెల్ఫోన్లను సీజ్ చేశారు.
Updated Date - 2020-10-25T02:41:53+05:30 IST