కళ్లకు గంతలు కట్టుకుని సీపీఐ నేతల వినూత్న నిరసన
ABN, First Publish Date - 2020-08-14T17:12:14+05:30
అమరావతి: సీపీఐ ఆధ్వర్యంలో, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని ఉద్దండరాయునిపాలేనికి చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు.
అమరావతి: సీపీఐ ఆధ్వర్యంలో, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని ఉద్దండరాయునిపాలేనికి చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోది శంకుస్థాపన చేసిన స్థలం వద్ద సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు దీక్షలు నిర్వహించారు. కళ్ళకు గంతలు కట్టుకొని సీపీఐ నేతల వినూత్న నిరసన నిర్వహించారు. సీపీఐ నేతల దీక్షలో ఆ రాజధాని ప్రాంత రైతులు, అమరావతి, రాజధాని పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-14T17:12:14+05:30 IST