వంగపండు, సున్నం రాజయ్య మృతి పట్ల సీపీఐ నేతల సంతాపం
ABN, First Publish Date - 2020-08-04T15:22:47+05:30
వంగపండు, సున్నం రాజయ్య మృతి పట్ల సీపీఐ నేతల సంతాపం
అమరావతి: ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రసిద్ధి చెందిన కళాకారుడు వంగపండు ప్రసాద్, అలాగే సీపీఎం నాయకులు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ సున్నం రాజయ్య మృతి పట్ల సీపీఐ నేతలు సంతాపం తెలిపారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు సంతాపం తెలియాజేశారు. రాజయ్య ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజయ్య నిబద్ధతగల కమ్యూనిస్టు అని... ఎన్ని అవరోధాలు ఎదురైనా పార్టీ పట్ల అంకితభావంగా నిలబడ్డారని అన్నారు. వారికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని సీపీఐ నేతలు తెలియజేశారు.
Updated Date - 2020-08-04T15:22:47+05:30 IST