ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిన వలసకూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-05-09T14:09:20+05:30

చనిపోయిన వలసకూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: రామకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కూలీలందరినీ స్వస్థలాలకు చేర్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆయన లేఖ రాశారు. చనిపోయిన వలస కూలీల కుటుంబాలకు తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. లాక్‌డౌన్ ప్రకటించి 45 రోజులు దాటినప్పటికీ వలస కూలీలు ఇబ్బందులు తొలగిపోలేదని తెలిపారు. 


అనంతపురం జిల్లా గుత్తిలో గత 40 రోజులుగా 122 మంది వలస కూలీలను పోలీసులు నిర్బంధించారన్నారు. మంగళగిరి వద్ద బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌కు చెందిన 1500 మంది వలస కూలీలు తీవ్ర అసహనంతో ఆందోళన చేపట్టారని...పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వివాదం ముదరకుండా చర్యలు చేపట్టారని అన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు వలస కూలీలు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారన్నారు. విశాఖ మృతులకు తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించారని...అయితే చనిపోయిన వలస కూలీల కుటుంబాలను ఆదుకోవడంలో వివక్ష తగదని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-09T14:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising