కోర్టులతో ఏపీ ప్రభుత్వం చెలగాటం: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-06-03T19:05:47+05:30
కోర్టులతో ఏపీ ప్రభుత్వం చెలగాటం: రామకృష్ణ
అమరావతి: కోర్టులతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ రంగులపై హైకోర్టు చెప్పినా వినకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాన్ని ఇన్ని సార్లు కోర్టు చీవాట్లు పెట్టిన సందర్భం లేదని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని రామకృష్ణ సూచించారు.
Updated Date - 2020-06-03T19:05:47+05:30 IST