ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత జడ్జిపై వైసీపీ నేతల దాడి దుర్మార్గం: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-07-16T13:31:30+05:30

దళిత జడ్జిపై వైసీపీ నేతల దాడి దుర్మార్గం: రామకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చిత్తూరు జిల్లాలో దళిత జడ్జిపై దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో అధికార వైఎస్ఆర్ పార్టీ నేతల భూకబ్జాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జస్టిస్ రామకృష్ణపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అనుచరులు దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సాక్షాత్తూ జడ్జిపైనే దాడి చేశారంటే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా వైసీపీ నేతలకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోందని అన్నారు. తక్షణమే దళిత జడ్జిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని... భూ కబ్జాలను అరికట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-16T13:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising