రాజధాని విషయంలో మరోసారి మోసానికి సిద్ధపడుతున్నారా?: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-07-08T13:41:26+05:30
రాజధాని విషయంలో మరోసారి మోసానికి సిద్ధపడుతున్నారా?: రామకృష్ణ
అమరావతి: ఏపీ రాజధానిపై బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సునీల్ దియోధర్ ప్రకటన మోసపూరితమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. ఒకపక్క రాష్ట్ర బీజేపీ నాయకులు అమరావతి రాజధానికి మద్దతు ఇస్తామంటుంటే, మరోపక్క రాజధానిపై కేంద్రం జోక్యం ఉండదని కేంద్ర బీజేపీ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్ని రాజధానులు పెట్టుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని సునీల్ దియోధర్ చెప్పటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై ఎలా మోసం చేసారో అదే విధంగా అమరావతి రాజధాని విషయంలో కూడా మరోసారి మోసానికి సిద్ధపడుతున్నారా? అని ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిపై దొంగ నాటకాలు బీజేపీకి తగునా? అని నిలదీశారు. బీజేపీ రెండు నాల్కల ధోరణి మానుకోవాలని రామకృష్ణ హితవు పలికారు.
Updated Date - 2020-07-08T13:41:26+05:30 IST