ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల పట్టాల పేరుతో అవినీతి: సోము ఆగ్రహం

ABN, First Publish Date - 2020-06-06T09:58:04+05:30

‘‘రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ ఆవ భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. తెనాలి, ఆదోని తదితరచోట్ల ఇదే తరహా దోపిడీ వ్యవహారాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 5: ‘‘రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ ఆవ భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. తెనాలి, ఆదోని తదితరచోట్ల ఇదే తరహా దోపిడీ వ్యవహారాలు వెలుగు చూశాయి’’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో పార్టీ నాయకులతో కలసి ఆయన ఆవ భూముల అక్రమాలపై నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో వేలకోట్లు అవినీతి జరిగిందన్న జగన్‌ ఇప్పటివరకూ ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తన ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో సాగుతున్న దోపిడీ బయటకు వస్తుందనే కారణంతోనే విచారణ జరిపించలేదనే అనుమానం కలుగుతోందన్నారు.

Updated Date - 2020-06-06T09:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising