ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాశీ నుంచి కరోనా!

ABN, First Publish Date - 2020-05-10T02:07:38+05:30

విదేశాల నుంచి వారితోనే కరోనా ముప్పు అని మొదట్లో భయపడ్డారు. ఆ తర్వాత ఢిల్లీ లింకులు రాష్ట్రాన్ని అతలాకుతలం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  విదేశాల నుంచి వారితోనే కరోనా ముప్పు అని మొదట్లో భయపడ్డారు. ఆ తర్వాత ఢిల్లీ లింకులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆ వేడి పూర్తిగా చల్లారక ముందే తాజాగా మరోవైపు నుంచి వైరస్ దాడి మొదలైంది. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌లో వారణాశి నుంచి వచ్చిన వారిలో 29 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.


పశ్చిమగోదావరి జిల్లాలో కాశీ యాత్రకు వెళ్లి వచ్చిన 9 మందికి కరోనా అని నిర్ధారణ అయింది. వీరిలో 8 మంది భక్తులు, క్యాబ్ డ్రైవరు ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మార్చిలో బయలు దేరారు. కాశీ చుట్టుపక్కల పుణ్య క్షేత్రాలను సందర్శించారు. ఈలోపే లాక్‌డౌన్ ప్రకటించడంతో వీరంతా కొద్ది రోజులపాటు కాశీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకుని ఈ నెల 2న రాజమండ్రికి చేరుకోగా అక్కడ పోలీసులు వీరందర్నీ భీమడోలు క్వారంటైన్‌కు తరలించారు. శుక్రవారం వీరి రిపోర్టులు వచ్చాయి. అందరికీ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీరిని క్యాబ్‌లో తీసుకొచ్చిన యూపీకి చెందిన డ్రైవర్‌కు కూడా కరోనా సోకడంతో అందరినీ ఏలూరులోని ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-05-10T02:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising