ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైదీకి కరోనా.. ఒంగోలు జైలులో కలవరం

ABN, First Publish Date - 2020-05-30T16:10:03+05:30

ఖైదీకి కరోనా.. ఒంగోలు జైలులో కలవరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: జిల్లాలోని మరో కరోనా కేసు వెలుగు చూసింది. ఒంగోలులోని జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి వైరస్‌ ఉన్నట్లు తేలింది. వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81కు చేరింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తిని ఇటీవల ఒక కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. దీంతో అతడిని ఒంగోలులోని జిల్లా జైలుకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా ఆయన శ్వాబ్‌ను తీసి పరీక్షల కోసం పంపగా కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ ఖైదీని రిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అతని ద్వారా ఎవరెవరికి వైరస్‌ సోకి ఉంటుందన్న విషయమై అధికారులు దృష్టి సారించారు. ఖైదీలు, జైలు సిబ్బందికి శనివారం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ట్రూనాట్‌పై చేసిన పరీక్షల్లో ఓ బాలుడికి పాజిటివ్‌ ఫలితం వచ్చింది. బేస్తవారపేట మండలం హనుమాయిపల్లికి చెందిన 11 సంవత్సరాల బాలుడు చెన్న్తె నుంచి ఇటీవల జిల్లాకు వచ్చాడు. అతనికి వీఆర్‌డీఎల్‌ పరీక్షలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతు న్నారు. అందులో కూడా పాజిటివ్‌గా తేలితేనే కరోనా కేసుగా పరిగణగించనున్నారు. 

Updated Date - 2020-05-30T16:10:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising