కరోనా అనుమానిత రోగి అదృశ్యం
ABN, First Publish Date - 2020-05-29T07:38:18+05:30
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కరోనా అనుమానిత రోగి అదృశ్యం కావడం కలకలం రేపింది.
- ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా పట్టివేత
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కరోనా అనుమానిత రోగి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆదోనికి చెందిన ఓ వృద్ధురాలి(64)కి ట్రూనాట్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఆమెను కర్నూలు స్టేట్ కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి తప్పించుకున్న ఆమె ఆదోని వెళ్లే బస్సు ఎక్కింది. గాలింపు చేపట్టిన పోలీసులు కోడుమూరు మండలం ప్యాలకుర్తి వద్ద బస్సులో ఉన్న ఆమెను పట్టుకొని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-05-29T07:38:18+05:30 IST