గంట్యాడ జడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా
ABN, First Publish Date - 2020-10-03T21:59:39+05:30
గంట్యాడ జడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది...
విజయనగరం: గంట్యాడ జడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత నెల 30న గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో 20 మంది విద్యార్థులకు కరోనా వచ్చినట్లు వెల్లడి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతులకు విద్యార్థులు హాజరుకావడం వల్లే కరోనా వ్యాప్తి జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
Updated Date - 2020-10-03T21:59:39+05:30 IST