ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-10-01T23:37:16+05:30

ఏపీలో కరోనా కేసులు ఏడు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 6,751 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా కేసులు ఏడు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 6,751 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 235 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో  కరోనాతో 41 మంది మృతి చెందారు. ఏపీలో 5,869కు కరోనా మరణాలు చేరాయి. ఏపీలో 57,858 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 6,36,508 మంది డిశ్చార్జ్ అయ్యారు. 


చిత్తూరు 7, కృష్ణా 6, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. జాతీయస్థాయిలో అత్యధిక కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. ఏపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. కర్ణాటక, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 986 కేసులు నమోదవగా.. చిత్తూరులో 888, ప్రకాశం జిల్లాలో 580, పశ్చిమగోదావరి జిల్లా 753 మందికి వైరస్‌ సోకినట్టు తేలింది. 

Updated Date - 2020-10-01T23:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising