ఏపీ సచివాలయంలో కరోనా కలకలం
ABN, First Publish Date - 2020-06-06T20:34:06+05:30
సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా తేలారు.
అమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్దారించారు. ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో 10మందికి కరోనా సోకింది. ఉద్యోగులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ ఉద్యోగి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఉద్యోగితో కలిసి తిరిగిన వారంతా, సికింద్రాబాద్ బస్లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-06-06T20:34:06+05:30 IST