కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలివ్వాలి: బొప్పరాజు
ABN, First Publish Date - 2020-10-01T07:56:34+05:30
కాంట్రాక్టు ఉద్యోగులను కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి వారికి జీత, భత్యాలు చెల్లించాలని ఏపీ జేఏసీ అమరా వతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు...
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగులను కంటిన్యూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి వారికి జీత, భత్యాలు చెల్లించాలని ఏపీ జేఏసీ అమరా వతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వినతిపత్రం అందజేసినట్లు ఒక ప్రకటన లో తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. వారి కాంట్రాక్టు సమయం అయిపోయిందని, కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. శాఖాధిపతుల నుంచి జ స్టిఫికేషన్ రిపోర్టు వస్తేనే తదుపరి కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తామనడం దారుణమని విమర్శించారు. ఉద్యోగుల వివరాలు సేకరించడం ప్రభుత్వ బాధ్యతని, దానికి జీతభత్యాలు ముడిపెట్టడం తగదని హితవు పలికారు.
Updated Date - 2020-10-01T07:56:34+05:30 IST