తనయుడు చేసిన పనికి మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-08-10T22:15:49+05:30
జిల్లాలోని చీరాలలో విషాదం చోటు చేసుకుంది. అక్రమ మద్యం తరలిస్తూ బుక్కైన కానిస్టేబుల్ కిరణ్ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిరణ్ చేసిన పనికి తీవ్ర మనస్తాపనం చెందిన అతని
ప్రకాశం : జిల్లాలోని చీరాలలో విషాదం చోటు చేసుకుంది. అక్రమ మద్యం తరలిస్తూ బుక్కైన కానిస్టేబుల్ కిరణ్ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిరణ్ చేసిన పనికి తీవ్ర మనస్తాపనం చెందిన అతని తండ్రి.. చీరాల వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే.. ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ తన బైక్పై తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తీసుకువస్తున్న క్రమంలో మద్దిపాడు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో పోలీసులు కిరణ్ నుండి తెలంగాణకు చెందిన 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని ఒంగోలు లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. అయితే కానిస్టేబుల్ కిరణ్ చేసిన పనికి అతని తండ్రి ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో చీరాల వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-08-10T22:15:49+05:30 IST