ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సీఎం జగన్ ఏం మేలు చేశారు? : నరహరిశెట్టి

ABN, First Publish Date - 2020-07-09T21:15:00+05:30

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు ఏం మేలు చేశారు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : ‘దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు ఏం మేలు చేశారు’ అని కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహరావు ప్రశ్నించారు. గురువారం నాడు విజయవాడలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. వైఎస్ చనిపోయేదాక కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, పార్టీ సిద్దాంతాలకు లోబడి రాష్ట్ర సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. 2004 నుంచి 2014 వరకు ఏపీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ది, సంక్షేమం  ప్రజలకు ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చారు.


రంగులు మార్చి..

వైఎస్ పాదయాత్రలో చేసిన హామీల అమలులో మొదటి సంతకం రైతులకు ఉచిత కరెంట్‌దే. విద్య, ఆరోగ్య వ్యవస్థలు సమాజాభివృద్దికి నిదర్శనం. ఫీజు రియంబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ఈ రెండు వ్యవస్థలు అభివృద్ది జరిగాయి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలనే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రంగులు మార్చి అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కూడా సామాజికంగా అభివృద్ది జరిగేలా సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం లోన్లను కూడా రద్దు చేసింది. ఇకనైనా జగన్ ప్రభుత్వం ప్రజా ప్రయోజన నిర్ణయాలతో పాలన చేయాలి అని నరహరిశెట్టి హితవు పలికారు.

Updated Date - 2020-07-09T21:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising