ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు జలకళ పథకానికి శ్రీకారం

ABN, First Publish Date - 2020-09-27T08:43:07+05:30

పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుడుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ పథకానికి ఈ నెల 28న  శ్రీకారం చుడుతోంది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేసేందుకు చేపట్టిన ఈ పథకానికి రూ.2,340కోట్లు కేటాయించారు. ఉచిత బోర్ల కోసం గ్రామవలంటీర్ల ద్వారా లేదా, ఆన్‌లైన్‌లో నేరుగా రైతులు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు బోరు డ్రిల్లింగ్‌ వరకు ఎప్పటికప్పుడు సంక్షిప్త సమాచారం ఇవ్వనున్నారు. భూగర్భ జలాల లభ్యతను అంచనా వేసి, బోర్లు వేస్తామని, ఉచిత బోర్ల ద్వారా 5లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-09-27T08:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising