ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగుల ఖర్చును వైసీపీ నేతల నుంచే రాబట్టాలి: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-06-03T23:28:45+05:30

రంగుల ఖర్చును వైసీపీ నేతల నుంచే రాబట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు చేస్తుందనేదానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రంగుల ఖర్చును వైసీపీ నేతల నుంచే రాబట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు చేస్తుందనేదానికి.. రంగుల ఉదంతమే నిదర్శనమని చెప్పారు. రాజ్యాంగ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కారం, అహంభావం, మూర్ఖత్వానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. తాము చేసిందే ఒప్పు అనేలా కోర్టుల్లో వాదనలు చేయడం.. తప్పుడు జీవోలు, వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం కన్నా.. మూర్ఖత్వం మరొకటి లేదని చంద్రబాబు తప్పుబట్టారు. ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం వంద తప్పులు చేసిందని దుయ్యబట్టారు. తీర్పు అమలు చేయలేదు కాబట్టే కోర్టు ధిక్కరణగా తీసుకుని, సీఎస్‌, సెక్రటరీ, కమిషనర్‌ హాజరు కావాలని ఆదేశించారని తెలిపారు. వైసీపీ తప్పులకు ముగ్గురు ఉన్నతాధికారులు కోర్టులో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఇంత జరిగినా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆక్షేపించారు. అందరిదీ ఒక దారైతే వైసీపీది మరో దారని ఎద్దేవాచేశారు. రంగులపై డబ్బులు, అడ్వొకేట్లకు ఫీజులు వృథా అని చంద్రబాబు చెప్పారు.

Updated Date - 2020-06-03T23:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising