ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ వారిని కట్టడి చేస్తే మంచిది: బీజేపీ వార్నింగ్

ABN, First Publish Date - 2020-09-21T15:16:17+05:30

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో, నిలువెల్లా అహంకారంతో హిందూ దేవతలను, సంప్రదాయాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో, నిలువెల్లా అహంకారంతో హిందూ దేవతలను, సంప్రదాయాలను అవమానపరుస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ మేరకు సోమవారం నాడు బీజేపీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అంతర్వేది రథం తగలబెడితే, దుర్గ గుడిలో సింహాలు మాయమైతే, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేస్తే పోయేదేమీ లేదా? దాన్ని డబ్బుతో వెళకడతావా నాని.. మరి అంతర్వేదిలో చర్చి రెండు అద్దాలు పగిలితే రూ. వెయ్యి, రెండు వేలో ఇస్తే సరిపోయేదిగా? 41 మందిపై కేసు ఎందుకు పెట్టారు? హిందూ దేవాలయాలపై, వేంకటేశ్వర స్వామిపై పిచ్చి వాగుడును ఆపకపోతే హిందువులు మీకు తగిన బుద్ధి చెబుతారు. పరిస్థితి అంతవరకు రాకముందే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన మంత్రులను, పార్టీ నాయకులను కట్టడి చేస్తే మంచిది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.’ అంటూ పార్టీ తరఫున నేతలు హెచ్చరించారు.

Updated Date - 2020-09-21T15:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising