అమిత్ షాతో మరోసారి సీఎం జగన్ భేటీ..
ABN, First Publish Date - 2020-09-23T16:24:48+05:30
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ మరోసారి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిన్న సాయంత్రం 40 నిముషాలపాటు భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం మరోసారి సమావేశమయ్యారు. ఈ భేటీ ఎంతవరకు కొనసాగుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. నిన్న జరిగిన భేటీలో కోర్టులు, న్యాయమూర్తులపై జరుగుతున్న దాడులపై, అనేక అంశాలపై చర్చలు జరిపి విషయం తెలిసిందే.
అంతకుముందు బుధవారం ఉదయం సీఎం జగన్ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. పోలవరంకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చాలా ఉన్నాయని, ఇటీవల పెంచిన అంచనాలకు కూడా సీడబ్ల్యూసీ ఆమెదం తెలిపిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ. 4వేల కోట్లు, రావల్సిన బకాయిలు రూ. 8,400 కోట్లు విడుదల చేయాలని షెకావత్ను కోరినట్లు సమాచారం. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి, ఏపీ విభజన చట్టంలోని అంశాలను చర్చించారు.
Updated Date - 2020-09-23T16:24:48+05:30 IST