అందరూ చెప్పేది ఒక్కటే.. సీఎం జగన్ చేసింది తప్పు
ABN, First Publish Date - 2020-10-17T19:49:45+05:30
న్యాయవ్యవస్థపై జగన్ సర్కార్ కత్తిగట్టినట్టు వ్యవహరిస్తున్న తీరును న్యాయవాద సంఘాలు, మాజీ న్యాయమూర్తులు ఖండిస్తున్నారు. సీజేఐకు సీఎం జగన్ రాసిన లేఖను
ఇంటర్నెట్ డెస్క్: న్యాయవ్యవస్థపై జగన్ సర్కార్ కత్తిగట్టినట్టు వ్యవహరిస్తున్న తీరును న్యాయవాద సంఘాలు, మాజీ న్యాయమూర్తులు ఖండిస్తున్నారు. సీజేఐకు సీఎం జగన్ రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని తప్పుపడుతున్నారు. న్యాయవ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణకు, స్వతంత్రతకు జగన్ తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. ఇది శాసన వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య యుద్ధంలా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు పలువురు లేఖలు రాస్తున్నారు. ఇప్పటి వరకు 12 లేఖలు సీజేఐకు చేరాయి. ఆ లేఖలు ఇవీ..
వీటితో పాటు ఇంకా ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్), ఏటీ బార్ అసోసియేషన్(అప్పీలేట్ ట్రిబ్యూనల్ బార్ అసోసియేషన్) కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశాయి.
Updated Date - 2020-10-17T19:49:45+05:30 IST