జగన్, చంద్రబాబు వేల కోట్ల ఏపీ ఆస్తులను..:కన్నా
ABN, First Publish Date - 2020-06-02T22:38:44+05:30
జగన్, చంద్రబాబు వేల కోట్ల ఏపీ ఆస్తులను..:కన్నా
అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు భయంతో యూటర్న్ చంద్రబాబు తీసుకున్నారని, వేలకోట్ల విలువైన ఏపీ ఆస్తులను తెలంగాణలో వదిలి కరకట్టకు వచ్చారని కన్నా విమర్శించారు. కేసీఆర్తో ఉన్న స్వార్ధప్రయోజనాల కోసం సీఎం జగన్.. వాటిపై నోరుమెదపకుండా.. వాటిని ఆయనకే అప్పగించారని ట్విట్టర్లో కన్నా విమర్శించారు. చట్టబద్ధంగా ఏపీకి చెందాల్సిన ఆస్తులపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కన్నా ట్వీట్ చేశారు.
Updated Date - 2020-06-02T22:38:44+05:30 IST