ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిలో అసైన్డ్‌ భూములపై ఐటీశాఖకు సీఐడీ లేఖ

ABN, First Publish Date - 2020-02-08T22:16:43+05:30

అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుపై రాద్ధాంతం జరుగున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భూముల కొనుగోలుపై విచారణ చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుపై రాద్ధాంతం జరుగున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భూముల కొనుగోలులో నగదు లావాదేవీలపై విచారణ జరపాలని ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖ రాశారు. 2018 నుంచి 2019 వరకు 106 అనుమానాస్పద భూ లావాదేవీలు జరిగినట్లు ఈ లేఖలో సునీల్ తెలిపారు. వీటిలో రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఈ లావాదేవీలపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆయన కోరారు. దర్యాప్తు వివరాలను తమకు తెలియజేస్తే, తాము తదుపరి చర్యలను చట్టపరంగా తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా.. ఈ లేఖతో పాటు అసైన్డ్‌ భూముల  కొనుగోలులో ఉన్న 106 మంది వ్యక్తుల పూర్తి వివరాలు, అడ్రస్‌లు, భూముల సర్వే నెంబర్లతో సహా ఐటీ చీఫ్ కమీషనర్‌కు సీఐడీ పంపింది.



Updated Date - 2020-02-08T22:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising