కరోనాకు చేయూత
ABN, First Publish Date - 2020-08-14T08:32:05+05:30
వైఎస్సార్ చేయూత పథకం నిధులను డ్రా చేసుకోవడానికి గురువారం అన్ని బ్యాంకుశాఖల వద్ద మహిళలు పెద్దసంఖ్యలో గుమికూడారు. కరోనా విజృంభిస్తున్న విషయం పూర్తిగా మరిచిపోయారు. భౌతిక దూ
చిత్తూరు కలెక్టరేట్/కార్వేటినగరం/నగరి/చంద్రగిరి, ఆగస్టు 13: వైఎస్సార్ చేయూత పథకం నిధులను డ్రా చేసుకోవడానికి గురువారం అన్ని బ్యాంకుశాఖల వద్ద మహిళలు పెద్దసంఖ్యలో గుమికూడారు. కరోనా విజృంభిస్తున్న విషయం పూర్తిగా మరిచిపోయారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగుంపులుగా తోసుకుంటూ క్యూలైన్లలో నిలబడ్డారు.పలుచోట్ల తోపులాటలు కూడా జరిగాయి.
దీనివల్ల బ్యాంకర్లూ ఇబ్బంది పడాల్సి వచ్చింది. బుధవారం నిర్వహించిన వైఎస్సార్ చేయూత కార్యక్రమాల్లో కూడా పలు చోట్ల భౌతికదూరం పాటించకపోవడం ఆందోళనకరం.పరిస్థితులు ఇలావుంటే కొవిడ్ కేసులు ఎలా తగ్గుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2020-08-14T08:32:05+05:30 IST