శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్
ABN, First Publish Date - 2020-10-23T14:19:49+05:30
నగరంలోని శేషాచలం అడవులలో టాస్క్ఫోర్స్ పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.
తిరుపతి: నగరంలోని శేషాచలం అడవులలో టాస్క్ఫోర్స్ పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో చంద్రగిరి మండలం సచ్చినోడు బండ వద్ద తమిళ స్మగ్లర్లు ఎదుటపడ్డారు. దీంతో పోలీసులను చేసిన వెంటనే దాదాపు 20 మంది దుండగులు... ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలేసి పారిపోయారు. సంఘటన స్థలంలో 16 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2020-10-23T14:19:49+05:30 IST