ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బల్లి’తోనే నాకు గుర్తింపు

ABN, First Publish Date - 2020-06-05T10:56:24+05:30

స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా.. తిరుపతిలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుడ వారధి భూమి పూజకూ పిలవలేదు

కార్పొరేషన్‌ అధికారులపై తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ ఆగ్రహం


తిరుపతి(ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా.. తిరుపతిలోని వినాయక్‌సాగర్‌ ఆధునికీకరణకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ పేరును బి.దుర్గాప్రసాద్‌గా రాశారు. శిలాఫలకంలో అందరి ఇంటి పేర్లు వివరంగా రాసి.. తనింటి పేరును ఇలా రాయడంపై ఎంపీ ఆగ్రహించారు.


‘బల్లి’తోనే తనకు గుర్తింపు అని.. ఇలా చేయడం సరికాదంటూ కార్పొరేషన్‌ అధికారులపై మండిపడ్డారు. అలాగే నగరంలో నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణం కేంద్రం ఇచ్చే స్మార్ట్‌ సిటీ నిధులతోనే జరుగుతోందన్నారు. దాని భూమిపూజకు కూడా తనను పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక గరుడ వారధికి టీటీడీ నిధులివ్వలేదన్నారు. చివరగా.. ‘సిగ్గులేకుండా ఉండాం.. కరోనా వచ్చి..’ అంటూ తనను తాను తిట్టుకుంటూ వెళ్లిపోయారు.  

Updated Date - 2020-06-05T10:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising