కరోనా అని తేలడంతో కుప్పకూలిన మహిళ
ABN, First Publish Date - 2020-11-25T06:22:18+05:30
కరోనా నిర్ధారణ అయ్యిందని చెవిన పడగానే ఒక మహిళ కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మంగళవారం సాయంకాలం కలికిరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఈ ఘటన జరిగింది.
కలికిరి, నవంబరు 24: కరోనా నిర్ధారణ అయ్యిందని చెవిన పడగానే ఒక మహిళ కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మంగళవారం సాయంకాలం కలికిరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఈ ఘటన జరిగింది. కలికిరి మండలం గుట్టపాళే నికి చెందిన ఓ మహిళ (65) శ్వాస పీల్చడం ఇబ్బంది కావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు కొవిడ్ పరీక్ష చేశారు. పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఆ మాట విన్న ఆ వృద్ధురాలు కుప్పకూలి ప్రాణాలొదిలింది.
Updated Date - 2020-11-25T06:22:18+05:30 IST