ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ మహా పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-10-26T16:27:59+05:30

జిల్లాలో టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. హంద్రీ - నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ మహా పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణచివేత చర్యలను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడామని... అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నామని వ్యాఖ్యానించారు. తక్షణమే టీడీపీ నాయకులపై గృహనిర్బంధం ఎత్తివేయాలని, అక్రమ కేసులను తొలగించాలని  డిమాండ్ చేశారు. రైతాంగ వ్యతిరేక చర్యలకు వైసీపీ స్వస్తి చెప్పాలన్నారు. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి తక్షణమే పరిష్కరించాలని... హంద్రీ - నీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-10-26T16:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising