2 నుంచి ఎస్వీయూ పీజీ అడ్మిషన్లు
ABN, First Publish Date - 2020-12-30T05:16:30+05:30
ఎస్వీయూ పీజీ అడ్మిషన్లు జనవరి రెండో తేదీ నుంచి చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 29: ఎస్వీయూ పీజీ అడ్మిషన్లు జనవరి రెండో తేదీ నుంచి చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 2న ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, జియాలజీ, సీప్ స్టడీస్, హోం సైన్స్, హైడ్రోజియాలజీ, ఫర్మార్మింగ్ ఆర్ట్స్, పాపులేషన్ స్టడీస్, సైకాలజీ, సంస్కృతం, సోషియల్ వర్క్, సోషియాలజీ, తమిళం, ఉర్దూ, టూరిజంతోపాటు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ సబ్జెక్టులకు సంబంధించిన దివ్యాంగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, కల్చరల్ అంశాలకు సంబంధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 3న కెమిస్ట్రీ, 4న కామర్స్, 5న ఎంపీఈడీ, ఫుడ్ టెక్నాలజీ, మేథమెటిక్స్, 6న బయో టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్, ఫిజిక్స్, 7న బోటనీ, కంప్యూటర్ సైన్స్, 8న బయో కెమిస్ట్రీ, ఎకనమిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు సబ్జెకులకు కౌన్సెలింగ్ చేపడతారు. 9న ఆక్వాకల్చర్, మైక్రోబయాలజీ, స్టాటిస్టిక్స్, 10న జువాలజీ, జనరల్ టెస్ట్ విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహిస్తారు. సమగ్ర వివరాలకు ఎస్వీయూడీవోఏ వెబ్సైట్లో చూడాలని ఎస్వీయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అధికారి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Updated Date - 2020-12-30T05:16:30+05:30 IST