తిరుపతిలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు
ABN, First Publish Date - 2020-07-13T11:54:17+05:30
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి తిరుపతిలో మధ్యాహ్నం రెండు గంటల..
చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం
తిరుపతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి తిరుపతిలో మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపార దుకాణాలు తెరిచి ఉంచాలని చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన సమావేశంలో అధ్యక్షుడు మంజునాథ్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో స్వచ్ఛందంగా దుకాణాలను మూతవేయాలని తీర్మానించుకున్నట్లు చెప్పారు. అలాగే వ్యాపారులకు అండగా ఉంటామని చెప్పారు. ఈసమావేశంలో రాయల చెరువు రోడ్డు ట్రేడర్స్ అసోసియేషన్, టైల్స్ అండ్ శానిటరీ ట్రేడర్స్ అసోసియేషన్, బంగారు-వెండి వ్యాపారుల సంఘం, ఫుడ్గ్రైన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్, నేతాజీ రోడ్డు ట్రేడర్స్ అసోసియేషన్, ఫుట్వేర్ మర్చంట్ అసోసియేషన్లతోపాటు పలు వ్యాపార సంఘాలు పాల్గొన్నాయి.
Updated Date - 2020-07-13T11:54:17+05:30 IST