అర్ధరాత్రి షికారీల అరెస్టు
ABN, First Publish Date - 2020-12-28T06:54:08+05:30
ఏర్పేడు మండలం చింతలపాలెం మరాఠీపురంలోని షికారీలను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.
శ్రీకాళహస్తి, డిసెంబరు27: ఏర్పేడు మండలం చింతలపాలెం మరాఠీపురంలోని షికారీలను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద సోమవారం జరిగే సభకు సీఎం జగన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలసి చిన్నబాబు (బాబ్లీ) హత్య కేసు, భూసమస్య గురించి వివరించాలని, అవసరమైతే నిరసన తెలపాలని షికారీలు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా షికారీల నాయకుడు పరశురాంతో పాటు పలువురిని అరెస్టు చేశారు. కాగా, షికారీలను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని సీసీఐ నేత చిన్న పెంచలయ్య ఖండించారు. ముఖ్యమంత్రిని కలవడానికి షికారీలకు అనుమతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2020-12-28T06:54:08+05:30 IST