6న నిరసన సభ
ABN, First Publish Date - 2020-11-30T07:01:04+05:30
దళితులు, ఆదివాసీలపై దాడులను ఖండిస్తూ తిరుపతిలో నిరసన సభ జరగనుంది.
తిరుపతి (ఆటోనగర్), నవంబరు 29: దళితులు, ఆదివాసీలపై దాడులను ఖండిస్తూ.. డిసెంబరు ఆరో తేదీన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన సభ నిర్వహిస్తామ ని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశంలో వారు ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని వచ్చేనెల 6న సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సీపీఐ, సీపీఎంల నుంచి జాతీయస్థాయి నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు సి.పెంచలయ్య, వి.నాగరాజు, ఎం.మురళి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-30T07:01:04+05:30 IST