ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య మీద ముందునుంచే అనుమానం.. మరోసారి గొడవ జరగడంతో.. కోపంతో..

ABN, First Publish Date - 2020-07-28T16:27:56+05:30

అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమానం పెనుభూతమై..

భార్యను హతమార్చి.. ఆపై భర్త ఆత్మహత్యాయత్నం


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. వి.కోట మండలం పాముగానిపల్లెకు చెందిన ప్రభాకర రెడ్డి(32) తన భార్య అరుణ(29)ను హతమార్చి.. అతనూ ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. భార్య అరుణ వివాహేతర సంబంధం కలిగివుందంటూ ప్రభాకర రెడ్డికి కొంతకాలంగా అనుమానమేర్పడింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.


ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ప్రభాకర రెడ్డి పొలం వద్ద వుండగా అక్కడికి అరుణ తన ఐదేళ్ల కుమారుడితో పశుగ్రాసం కోసం వచ్చింది. భార్యాభర్తలు అక్కడ గొడవ పడ్డారు. ఆవేశంలో ప్రభాకర రెడ్డి తన చేతిలో ఉన్న మచ్చుకత్తితో అరుణ మెడపై నరికాడు. చూస్తూ ఉన్న కుమారుడు సమీపంలో చెరువు పనులు చేసుకుంటున్న వారికి విషయం చెప్పాడు. వారు పొలం వద్దకు చేరుకునే సరికి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. భార్యను హతమార్చిన ప్రభాకరరెడ్డి కత్తితో తన గొంతు కోసుకుని కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తల్లి మృతి చెందడం.. తండ్రి ఆస్పత్రి పాలు కావడంతో ఇద్దరు(ఓ అబ్బాయి, ఓ అమ్మాయి) అనాథలుగా మారారు. వి.కోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-28T16:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising