ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2020-10-25T10:52:16+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కొవిడ్‌ కారణంగా వార్షిక బ్రహ్మోత్సవాల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, అక్టోబరు 24: తిరుమల వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కొవిడ్‌  కారణంగా వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలోనే ఈ ఉత్సవాలను కూడా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.నవరాత్రి బ్రహ్మోత్సవాలను పరిమిత భక్తుల నడుమ మాడవీధుల్లో నిర్వహించాలని తొలుత టీటీడీ అనుకున్నప్పటికీ భక్తులు, టీటీడీ ఉద్యోగుల ఆరోగ్యానికి మంచిదికాదనే ఉద్దేశంతో చివరకు ఏకాంతంగానే వాహన సేవలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే 16 నుంచి 24వ తేదీ వరకు ఆలయంలోనే వాహనసేవలు వైభవంగా నిర్వహించారు.


మరోవైపు యాగశాలలో కూడా వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిపించారు. చివరిరోజైన శనివారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని అయిన మహల్‌ ముందు ఏర్పాటు చేసిన మినీ పుష్కరిణిలో చక్రత్తాళ్వారును మునకలు వేయించి పుణ్యస్నానం పూర్తి చేశారు. తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి చక్రస్నానం నిర్వహిస్తారు. కాగా, రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి  బంగారు తిరుచ్చి నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. 

Updated Date - 2020-10-25T10:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising