టీచర్లకు నేడు, రేపు వైద్య పరీక్షలు
ABN, First Publish Date - 2020-12-01T06:52:28+05:30
బదిలీల్లో భాగంగా వైద్య కారణాలతో దరఖాస్తు చేస్తున్న టీచర్లకు మంగళ, బుధవారాల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
చిత్తూరు (సెంట్రల్), నవంబరు 30: బదిలీల్లో భాగంగా వైద్య కారణాలతో దరఖాస్తు చేస్తున్న టీచర్లకు మంగళ, బుధవారాల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో నరసింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఆర్థో, న్యూరో విభాగాలకు సంబంధించి టీచర్లు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. మిగిలిన కేటగిరీల టీచర్లు బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రధాన వైద్యశాలకు చేరుకోవాలన్నారు. వైద్య పరీక్షలకు గైర్హాజరైన వారిని సంబంధిత కేటగిరీ నుంచి తొలగిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Updated Date - 2020-12-01T06:52:28+05:30 IST