ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి.. మహిళ మృతి

ABN, First Publish Date - 2020-11-29T05:42:31+05:30

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకాల, నవంబరు 28: నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది. పాకాల మండలంలోని వల్లివేడు దళితవాడకు చెందిన ఎర్రమ్మ (56) శుక్రవారం పశువులు మేపడానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రం ఆవులు ఇంటికి వచ్చేసినా ఎర్రమ్మ రాలేదు. దీంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆమెకోసం గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం వైసీపీ నాయకుడు వల్లివేడు రాజారెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు, వీఆర్వో హరికృష్ణలు పోలీసులకు సమాచారం అందించి స్థానిక యువకులతో కలిసి గాలించారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని వరదరాజస్వామి చెరువులో మహిళ మృతదేహాన్ని గుర్తించి, వెలికితీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ రాజశేఖర్‌లు మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి శవ పరీక్ష నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-29T05:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising