కొళ్లుపల్లెలో దాహం.. దాహం
ABN, First Publish Date - 2020-06-06T10:21:38+05:30
మీరు చూస్తున్న ఈ చిత్రం రామకుప్పం మండలం కొంగనపల్లె పంచాయతీ కొళ్లుపల్లెలోనిది
రామకుప్పం, జూన్ 5: మీరు చూస్తున్న ఈ చిత్రం రామకుప్పం మండలం కొంగనపల్లె పంచాయతీ కొళ్లుపల్లెలోనిది. గ్రామంలో బోరులో నీరు అడుగంటి పోవడంతో పంచాయతీవారు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేవారు. ప్రస్తు తం ఐదు రోజులుగా ట్యాంకర్లను ఆపేశారు. దీంతో జనాలకు జలకష్టం తీవ్ర మైంది. స్పందించిన స్థానిక టీడీపీ నేత బాబు తన వ్యవసాయ బోరు వద్ద నీటిని వదలడంతో జనం ఇలా బారులు తీరారు. కాగా శనివారం నుంచి ట్యాంకరు ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని గ్రామకార్యదర్శి మంజునాథ్ తెలియజేశారు.
Updated Date - 2020-06-06T10:21:38+05:30 IST