ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటినుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

ABN, First Publish Date - 2020-12-13T06:44:09+05:30

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను సోమవారం నుంచి ఈనెల 20వతేదీ వరకు జరుగుతాయని ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా ట్యాబ్‌ ద్వారా పరీక్షలు: ఆర్డీవో 


తిరుపతి(విద్య), డిసెంబరు 12: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను సోమవారం నుంచి ఈనెల 20వతేదీ వరకు జరుగుతాయని ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శనివారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి ఉమెన్స్‌ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజ్‌, ఎమరాల్డ్స్‌ డిగ్రీ కాలేజ్‌ కేంద్రాల్లో జరిగే పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈఏడాది కొత్తగా ట్యాబ్‌ ద్వారా పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 893మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగానే చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. సెక్షన్‌ ఆఫీసర్లు మాధవీలత, అంజన, ఏవో సురేష్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T06:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising