వీర జవాన్ కుటుంబానికి గవర్నర్ సాయం
ABN, First Publish Date - 2020-12-08T04:53:58+05:30
కశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్కుమార్రెడ్డి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలను గవర్నర్ బిశ్వన్భూషణ్ హరిచందన్ మంజూరు చేసినట్లు రాజ్భవన్ వర్గాలు సోమ వారం ఓ ప్రకటన విడుదల చేశాయి.
ఐరాల, డిసెంబరు 7: కశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్కుమార్రెడ్డి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలను గవర్నర్ బిశ్వన్భూషణ్ హరిచందన్ మంజూరు చేసినట్లు రాజ్భవన్ వర్గాలు సోమ వారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ గత నెల 8న ఉగ్రదాడిలో మృతిచెందిన సంగతి విదితమే. గవర్నర్ తన విచక్షణాధికారంతో రూ.2 లక్షల చెక్కును 18 మద్రాసు రెజిమెంట్ అధికారులకు అందజేశారు. ఈ నగదు ప్రవీణ్ భార్య రజిత ఖాతాకు నగదు బదిలీ కానుంది. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు, డిఫెన్స్ అకౌంట్ ఉండడంతో పాటూరు స్టేట్బ్యాంకు తరపున బీమా సొమ్ము రూ.30 లక్షలు అందిన విషయం తెలిసిందే.
Updated Date - 2020-12-08T04:53:58+05:30 IST