ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి స్థలాన్ని అడవిలో ఇస్తారా?

ABN, First Publish Date - 2020-07-08T11:29:08+05:30

ఇంటి స్థలాన్ని అడవిలో ఇస్తారా? అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణ ప్రశ్నించారు. పేదలకు స్థానికంగానే ఇళ్లు కేటాయించాలంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణ


తిరుపతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఇంటి స్థలాన్ని అడవిలో ఇస్తారా? అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణ ప్రశ్నించారు. పేదలకు స్థానికంగానే ఇళ్లు కేటాయించాలంటూ మంగళవారం తన నివాసంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుతం జనావాసాల మధ్య పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే, సీఎం జగన్‌ ప్రభుత్వం కొండల్లో, గుట్టల్లో, నిరుపయోగమైన  స్థలాలిచ్చేందుకు సిద్ధమవడం తగదన్నారు.


తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్లస్థలాలు ఇవ్వడం వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగంలేదన్నారు. గతంలో పేదలకోసం నిర్మించిన గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సూరా సుధాకర్‌ రెడ్డి, బుల్లెట్‌ రమణ, బ్యాంకు శాంతమ్మ, రామ్మూర్తి రాయల్‌, ఊట్ల సురేంద్ర నాయుడు, చినబాబు, మునిశేఖర్‌ రాయల్‌, మక్కీ యాదవ్‌, రుద్రకోటి సదాశివం, ఆర్పీ శ్రీనివాస్‌, మైనం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T11:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising