ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమూల్‌కి విజయ డెయిరీని అప్పగించడం దారుణం’

ABN, First Publish Date - 2020-12-03T05:28:50+05:30

విజయ డెయిరీని పునఃప్రారంభించాలని ఈదల నిరసన

విజయ డెయిరీ వద్ద వెంకటాచలం నాయుడి నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సిటీ, డిసెంబరు 2: విజయ డెయిరీని పునఃప్రారంభించకుండా, అమూల్‌ సంస్థతో ప్రభుత్వం పాల సేకరణకు ఒప్పందం కుదుర్చుకోవడం దారుణమని శాంతియుత ఉద్యమ నేత, జిల్లా పాడిరైతు సంఘం నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు విమర్శించారు. బుధవారం నగరంలోని విజయ డెయిరీ వద్ద ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటాచలం మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ తమ పార్టీ అధికారంలోకి రాగానే విజయ డెయిరీని, చిత్తూరు, గాజులమండ్యం షుగర్‌ ఫ్యాక్టరీలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ విషయం విస్మరించి గుజరాత్‌కు చెందిన అమూల్‌ సంస్థతో పాల సేకరణకు ఒప్పందం కుదుర్చుకోవడం అన్యాయమని మండిపడ్డారు. జిల్లా పాడిరైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. 

Updated Date - 2020-12-03T05:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising