52మందికి కరోనా
ABN, First Publish Date - 2020-12-30T06:41:55+05:30
జిల్లాలో మరో 52 కరోనా కేసులు బయటపడ్డాయి.
తిరుపతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 52 కరోనా కేసులు బయటపడ్డాయి.తిరుపతి నగరంలో 14, ఐరాలలో 10, తిరుపతి రూరల్ మండలంలో 7, మదనపల్లె, శ్రీకాళహస్తి, సోమల మండలాల్లో 3 వంతున, చంద్రగిరి, పీలేరు మండలాల్లో 2 చొప్పున, కలకడ, కంభంవారిపల్లె, పెనుమూరు, ఉంగనూరు, పూతలపట్టు, రామచంద్రాపురం, రామకుప్పం, తవణంపల్లె మండలాల్లో ఒక్కొక్కటి కొత్త కేసుల్లో వున్నాయి.వీటితో కలిపి జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య 88706కు చేరుకుంది. మంగళవారం ఉదయానికి జిల్లాలో 379 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయని అధికారులు ప్రకటించారు.
Updated Date - 2020-12-30T06:41:55+05:30 IST