ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల పవిత్రత దెబ్బతీసేలా వైవీ చర్యలు: టీడీపీ

ABN, First Publish Date - 2020-09-21T11:52:46+05:30

తిరుమల పవిత్రత దెబ్బతీసేలా వైవీ చర్యలు: టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సిటీ, సెప్టెంబరు 20: తిరుమల పవిత్రత దెబ్బతీసేలా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చర్యలున్నట్లు ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, పార్టీ కార్యాలయ కార్యదర్శి సురేంద్రకుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే అన్య మతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని వైవీ ప్రకటించడం తిరుమల ఆలయ నిబంధనలకు తూట్లు పొడిచేలా ఉందని మండిపడ్డారు. అన్య మతస్తులు కొండమీద ఏమైనా చేసుకోవచ్చనడం శ్రీవారి భక్తులు, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. సీఎం జగన్‌ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఘటనలు అధికంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆలయ సాంప్రదాయాలు, హైందవధర్మాన్ని గౌరవించని వారు కీలక పదవుల్లో ఉండటం సరికాదని స్పష్టం చేశారు. 


Updated Date - 2020-09-21T11:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising