ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోయకొండ యాత్ర విషాదాంతం

ABN, First Publish Date - 2020-02-05T23:04:46+05:30

ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో బాలుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటనలో చౌడేపల్లె మండలంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్విచక్రవాహనం బోల్తా పడి బాలుడి మృతి
తల్లిదండ్రులకు తీవ్రగాయాలు

చౌడేపల్లె, ఫిబ్రవరి 4: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో బాలుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటనలో చౌడేపల్లె మండలంలో మంగళవారం సాయంత్రం జరిగింది. బాధితుల కథనంమేరకు వివరాలు.. మదనపల్లెకు చెందిన రాజేష్‌(52) తన ద్విచక్రవాహనంలో తన భార్య సరేఖ(45), కుమారుడు దీపక్‌(7)తో బోయకొండ గంగమ్మను దర్శించుకోవటానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో రణబేరి గంగమ్మను దర్శించుకున్నారు.
 
కొండ కిందకు వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. సురేఖ కుడికాలు విరగడంతో పాటు తల, చేతికి గాయాలయ్యాయి. చిన్నారి దీపక్‌ తలకు బలమైన గాయం కావటంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. క్షతగాత్రులను 108 వాహనంతో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Updated Date - 2020-02-05T23:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising