చిత్తూరులో ఎక్కడికక్కడ టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
ABN, First Publish Date - 2020-09-23T15:59:45+05:30
తిరుమలకు సీఎం జగన్ మోహన్రెడ్డి రాక సందర్భంగా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు.
చిత్తూరు: తిరుమలకు సీఎం జగన్ మోహన్రెడ్డి రాక సందర్భంగా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి, అనూష రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2020-09-23T15:59:45+05:30 IST