ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేట ఎమ్మెల్యే రజినీ వర్గీయులపై దాడి

ABN, First Publish Date - 2020-02-22T08:54:16+05:30

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడదల గోపి, ఎమ్మెల్యే అనుచరులు ఐదుగురిపై గురువారం అర్ధరాత్రి దాడి జరిగింది. కారులో వస్తుండగా కోటప్పకొండ-చిలకలూరిపేట మార్గంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలకలూరిపేట, ఫిబ్రవరి 21 : గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడదల గోపి, ఎమ్మెల్యే అనుచరులు ఐదుగురిపై గురువారం అర్ధరాత్రి దాడి జరిగింది.  కారులో వస్తుండగా  కోటప్పకొండ-చిలకలూరిపేట మార్గంలో కట్టుబడివారిపాలెం యుటి జంక్షన్‌ సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి చిలకలూరిపేట అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో  కేసు నమోదయింది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడవల్లి, మద్దిరాల, కమ్మవారిపాలెం గ్రామాలకు చెందిన పదిమందితోపాటు మరికొందరు కలసి తమ కారును అడ్డుకుని దాడిచేసి హత్యాయత్నం జరిపారని, కారును ధ్వంసం చేశారని బాధితులు ఫిర్యాదులో వివరించారు.  ఎమ్మెల్యే  రజినిని దూషించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని గుంటూరు రేంజ్‌ ఐజి వినిత్‌బ్రిజ్‌లాల్‌, జిల్లా రూరల్‌ ఎస్పీ విజయరావు శుక్రవారం పరిశీలించారు.  

Updated Date - 2020-02-22T08:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising