టీడీపీ సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
ABN, First Publish Date - 2020-07-08T21:40:14+05:30
టీడీపీ సీనియర్ నాయకులతో ఆ పార్టీ అదినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ జరపాల్సింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా దినోత్సవమని దుయ్యబట్టారు.
అమరావతి: టీడీపీ సీనియర్ నాయకులతో ఆ పార్టీ అదినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ జరపాల్సింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా దినోత్సవమని దుయ్యబట్టారు. వ్యవసాయ బడ్జెట్లో 35శాతం మాత్రమే ఖర్చు పెట్టిన.. వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదని హెచ్చరించారు. వ్యవసాయానికి 10 శాతం బడ్జెట్ పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. టీడీపీ ఐదేళ్లలో వ్యవసాయానికి 90వేల కోట్ల నిధులు కేటాయించామని చంద్రబాబు తెలిపారు.
Updated Date - 2020-07-08T21:40:14+05:30 IST