జగన్కు చంద్రబాబు లేఖ
ABN, First Publish Date - 2020-09-27T22:21:26+05:30
సీఎం జగన్కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం దివ్యస్మృతికి నివాళిగా నెల్లూరులో మ్యూజికల్ యూనివర్సిటీ నెలకొల్పాలని కోరారు.
అమరావతి: సీఎం జగన్కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం దివ్యస్మృతికి నివాళిగా నెల్లూరులో మ్యూజికల్ యూనివర్సిటీ నెలకొల్పాలని కోరారు. బాల సుబ్రమణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంతాన్ని బాల సుబ్రమణ్యం కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంగీత అకాడమీకి ఎస్పీ బాలు పేరు పెట్టాలని, ఎస్పీ బాలు జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలన్నారు. ఎస్పీ బాలు పేరిట జాతీయ పురస్కారం అందజేయాలని లేఖలో చంద్రబాబు కోరారు.
Updated Date - 2020-09-27T22:21:26+05:30 IST